సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి -  ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి -  ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- మండలంలోని సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, ఎంపీడీవో భాస్కర్, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, ఎంపీటీసీలు బందారపు సుమలత లక్ష్మణ్ గౌడ్, చిలుక బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.