కోతుల వీరంగం.. విద్యార్థికి తప్పిన ప్రమాదం

కోతుల వీరంగం.. విద్యార్థికి తప్పిన ప్రమాదం

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- రాష్ట్రవ్యాప్తంగా జరిగే 10వ తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని గౌతమి స్కూల్ కి చెందిన మనోజ్ఞ కు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెంటర్ పడడంతో పరీక్ష రాసేందుకు వచ్చింది. అయితే పరీక్ష రాసేందుకు మనోజ్ఞ బిల్డింగ్ పై ఉన్న పరీక్ష కేంద్రానికి వెళుతుండగా మార్గమధ్యంలో మనోజ్ఞను మూడు కోతులు చుట్టూ ముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించగా భయభ్రాంతులకు గురైన మనోజ్ఞ ఏమి చేయాలో అర్థం కాక బిల్డింగ్ పై నుండి ఒక్కసారిగా కిందకు దూకేసింది.దీంతో మనోజ్ఞకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది కోతులను తరిమికొట్టారు. వెంటనే ప్రభుత్వ డాక్టర్లు మనోజ్ఞను పరిశీలించి గాయాలు ఏమీ కాకపోవడంతో పరీక్షా కేంద్రానికి పంపించారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడద నుండి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.