కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన యువజన కాంగ్రెస్ నాయకులు.....

కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన యువజన కాంగ్రెస్ నాయకులు.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు చామల ఉదయ్ చందర్ రెడ్డి మంగళవారం నాడు హైదరాబాదులో మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉదయ్ చందర్ రెడ్డికి పార్టీ కండువా మెడలో కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉదయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు హాకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఉదయ్ చందర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.