వైభవంగా లక్ష పుష్పార్చన

వైభవంగా లక్ష పుష్పార్చన

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల గ్రామంలో గల పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 21వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పూలతో అర్చన చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కర్త, జడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు.