ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల వ్యక్తి ఆత్మహత్య..

ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల వ్యక్తి ఆత్మహత్య..

ముద్ర, కోరుట్ల:- ఆర్థిక ఇబ్బందుల కారణాలవల్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల చోటు చేసుకుంది. కోరుట్ల అయ్యప్ప గుట్ట ప్రాంతానికీ చెందిన ఎల్లేశ్వరం శంకర్(45) కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శంకర్ కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. తీసుకున్న అప్పుకు వడ్డి కట్టలేక కుటుంబ పోషణ బారమై అర్థిక ఇబ్బందుల కారణాలతో మంగళవారం వేకువ జామున ఇంట్లోని వారు నిద్రిస్తున్న సమయంలో సుమారుగా 4 గంటలకు ఊరి వేసుకొని అత్మహత్య  చేసుకున్నట్లు  తెలిపారు.  స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కొక్కుల శ్వేత తెలిపారు.