తూప్రాన్ లో భారీ చోరీ

తూప్రాన్ లో భారీ చోరీ
  • 7లక్షలు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు

ముద్ర, తూప్రాన్:మెదక్ తూప్రాన్ పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి మూసి ఉంచిన వ్యాపార సముదాయంలో దొంగలు పడి 7 లక్షల పైచిలుకు రూపాయలు చోరి చేసినట్లు ఎస్ఐ శివనందం తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం తూప్రాన్ పట్టణానికి చెందిన మామిళ్ళ శ్రీకాంత్ హోండా షోరూమ్ ఎదురుగా నటరాజ్ సిమెంట్ స్టీల్ షాప్ నడుపుతున్నాడు.

శుక్రవారం రాత్రి షాప్ రోజు మాదిరిగానే మూసి వేసి ఇంటికి వెళ్లగా శనివారం ఉదయం షాప్ కి వెళ్ళి చూడగా షాప్ లోని సీలింగ్ ధ్వంసం అయి ఉండి, షాప్ లో గల 7లక్షల పది వేల రూపాయలు కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం రప్పించి సిబ్బంది, జాగిలాలతో తనిఖీలు నిర్వహించి ఆనవాళ్లు సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.