రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుడిగాలి పర్యటన 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుడిగాలి పర్యటన 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు మంత్రులు పాల్గొన్న సమీక్ష మొత్తం గంటన్నరలో ముగించేశారు.

హడావిడిగా ఏర్పాటుచేసిన జిల్లా సమీక్ష రివ్యూ మీటింగ్ మొత్తం గంటన్నరలో ముగియడంతో మంత్రి ప్రోగ్రాం పై స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇది ఏమి రివ్యూ పబ్లిక్l లో చర్చనీయాంశమైంది. తర్వాత వైద్యమంత్రితో పాటు జూపల్లి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. వార్డులను పర్యవేక్షించారు. రోగులకు అందుతున్న వైద్యం, వార్డుల తీరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం జిల్లా మెడికల్ కళాశాలను విజిట్ చేశారు. కళాశాలలో వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.