అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం
  • నాగర్ కర్నూల్ ఎంపీ రాములు

ముద్ర,పానుగల్:-అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఢంకా మోగించడం ఖాయమని నాగర్ కర్నూల్ జిల్లా ఎంపీ రాములు అన్నారు మంగళవారం పానగల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో మాట్లాడారు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని,సంక్షేమ పథకాలు విజయానికి దోహదపడతాయని అన్నారు. గ్రామాలలో ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త BRS మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.సమావేశంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాము యాదవ్, సర్పంచులు గోపాల్ రెడ్డి, బాలస్వామి, మాజీ సర్పంచ్ చిక్కేపల్లి నరసింహ, సింగిల్ విండో డైరెక్టర్ జైపాల్ రెడ్డి, నాయకులు తిరుపతి యాదవ్, ధర్మారెడ్డి, రామచందర్ రావు,ధనుంజయ్ రెడ్డి, ఆది హనుమంతు, రామకృష్ణ,రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.