ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

 బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం నెమరుగోముల, బ్రాహ్మణపల్లి గ్రామాలకు  చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీబీనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్, నెమరుగోముల గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస రెడ్డి, మోహన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, పాలకూర జంగయ్య, బీఆర్ఎస్ గ్రామశాఖ ప్రతినిధులు పాండుగౌడ్, మండల మైనారిటీ విభాగం అధ్యక్షుడు సలీంఖాన్, మాజీ ఉపసర్పంచి కృష్ణ, బీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

   

   భ్రాహ్మణపల్లి గ్రామం నుంచి బీఆరెస్ మండల నాయకులు తూపల్లి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గూడూరు మహీపాల్ రెడ్డి, సురకంటి బస్వారెడ్డి, తూపల్లి బస్వారెడ్డి, తోట బాల్ రాజు, కొలను సుధాకర్ రెడ్డి, సురకంటి సత్తి రెడ్డి, పల్లెగూడెం నుంచి బీఆర్ఎస్ మండల నాయకులు సామల ప్రవీణ్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి లతో పాటు మరో 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

          ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్తి రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పొట్టోళ్ల శ్యాం గౌడ్, గోలి పింగల్ రెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ గడ్డం బాలక్రిష్ణ, మాజీ జడ్పీటీసీ సందిగారి బస్వయ్య, మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, ఆగమయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కొలను నిఖిల్ రెడ్డి, మహదేవపూర్ కాంగ్రెస్ నాయకుడు దండెం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.