శ్రీధర్ బాబు గెలుపుతో మంథని ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు  - ఓడేడు సర్పంచ్ సిరికొండ బక్కరావు

శ్రీధర్ బాబు గెలుపుతో మంథని ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు  - ఓడేడు సర్పంచ్ సిరికొండ బక్కరావు

ముద్ర ముత్తారం:-మంంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గెలుపుతో మంథని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని,  ముత్తారం మండలంలోని ఓడేడ్ గ్రామ సర్పంచ్ సిరికొండ బక్కారావు అన్నారు. శనివారం ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంథని నియోజక వర్గంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అరాచక పాలన కొనసాగిందని,  రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, దీంతో ప్రజలు చాలా భయం గా బతకారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మంథని నియోజక ప్రజలు గూండాయిజానికి, రౌడీ యిజానికి స్వస్తి పలికి మంథని ఎమ్మెల్యేగా మచ్చలేని శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు గెలుపు కోసం నిరంతరం కృషిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట గ్రామ ప్రజలు ఉన్నారు.