కామారెడ్డి జిల్లాలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు: పాల్గొన్న స్పీకర్ పోచారం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో గురువారం నాడు శ్రీ రామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే రామాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బాన్సువాడ నియోజకవర్గంలో శ్రీ రామ నవమి సందర్భంగా పలు ఆలయాలలో శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొని స్వామి వారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు.

దేశాయిపేట్, సోమేశ్వర్,తీర్మలాపుర్, బాన్సువాడ పట్టణంలోనీ శ్రీరామ కాలనీ,మార్కండేయ మందిరం దగ్గర ఆలయంలలో శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలోని హనుమాన్ మందిరములో  శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన సీతా రాముల కళ్యాణ వేడుకలకు హాజరై పట్టు వస్రాలను బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమర్పించారు. జుక్కల్ నియోజకవర్గంలో ని బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే రాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు.