చిల్డ్రన్స్ పార్క్ బోరు మోటార్ స్థల పరిశీలన
బాన్సువాడ, ముద్ర: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న చిల్డ్రన్స్ పార్కు లో బోరు మోటర్ వేసేందుకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్థల పరిశీలన చేశారు. అలాగే మల్టీ జనరేషన్ పార్కులో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించారు. త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్ కుమార్, నాయకులు నార్ల ఉదయ్, యూనుస్ ఉన్నారు.
27న బండ్ల జాతర
బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ర్ ఆధ్వర్యంలో ప్రతి ఏట జరిగే బేతాల స్వామి జాతర కొరకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 27 తేదీ బండ్ల జాతర,28 న కుస్తీ పోటీలు నిర్వహిచడం జరుగుతుందని ఛైర్మన్ తెలిపారు. సమావేశంలో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ రమేష్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు,పుర ప్రముఖులు పాల్గొన్నారు.