రైతులకు న్యాయం చేస్తాం: జుక్కల్ ఎమ్మెల్యే షిండే

రైతులకు న్యాయం చేస్తాం: జుక్కల్ ఎమ్మెల్యే షిండే

ముద్ర, పిట్లం: అకాల వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ లో వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు రైతులకు కన్నీటిని మిగిల్చాయని ఆవేదన చెందారు. నియోజకవర్గంలో వరి తో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని, వ్యవసాయ అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి నివేదికను తయారు చేయిస్తామన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ తో పాటు పరిహారం అందేలా చూస్తామన్నారు.