గోతిలో పడ్డ కారు  ఒకరి మృతి

గోతిలో పడ్డ కారు  ఒకరి మృతి

నలుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు

మోత్కూరు (ముద్ర న్యూస్): మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దొండ లింగయ్య కుటుంబంతో సహా రామన్నపేట లో బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా బుజిలాపురం సబ్ స్టేషన్ వద్ద కారు అదుపుతప్పి  రోడ్డు కు పక్కన గోతిలో పడిపోయింది . సంఘటన శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో  కారు డ్రైవింగ్ చేస్తున్న లింగయ్య చిన్నల్లుడు ప్రకాష్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.

లింగయ్య భార్య నీలమ్మకు, అతని చిన్న కూతురు అరుణ, ఆమె మామకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు నలుగురు చిన్న పిల్లల ఉండగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మోత్కూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.