ఎస్ వెంకట్ నారాయణకు పొత్తూరి స్మారక అవార్డు

ఎస్ వెంకట్ నారాయణకు పొత్తూరి స్మారక అవార్డు

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్:  సుప్రసిద్ధ సంపాదకులు స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎస్ వెంకటనారాయణ అందుకున్నారు.
మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్  సుదర్శన్ రెడ్డి, సుప్రసిద్ధ సంపాదకులు కె రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్, ప్రముఖ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడు ప్రతిపక్ష పాత్రేనని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను వెలికి తెచ్చి పరిష్కరింప చేయడం జర్నలిస్టులకే సాధ్యమని ఆయన అన్నారు.