డ్రగ్స్ కోసం ఖైదీలు ఆందోళన

డ్రగ్స్ కోసం ఖైదీలు ఆందోళన
  • చర్లపల్లి జైల్లో షాకింగ్ ఘటన
  • సిబ్బందిపై తిరగబడ్డ డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఖైదీలు
  • ప్రత్యేక బ్యారక్ లోకి తరలించిన అధికారులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : చర్లపల్లి జైలులో డ్రగ్స్ కోసం నలుగురు విచారణ ఖైదీలు ఆందోళనకు దిగారు. మత్తుపదార్ధాలకు అలవాటు పడిన ఖైదీలు శనివారం ఉదయం జైలు సిబ్బందిపై తిరగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు నలుగురు ఖైదీలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక బ్యారక్ లోకి తరలించారు.