సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షునిగా గణేష్ నియమకం.....

సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షునిగా గణేష్ నియమకం.....

రామన్నపేట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా సామాజిక సంఘం జిల్లా అధ్యక్షునిగా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన తలారి గణేష్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కామెడీ సతీష్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ వివిధ దినపత్రికలలో సంచలనాలకు మారుపేరైన శీర్షికలను. వ్యాసాలను రాస్తూ ప్రజల ఆతరాభిమానులను అందుకున్నట్లు చెప్పారు.

సమాజానికి దిక్సూచిగా నిలిచేది రచయితలేనని సామాజిక అంశాలపై రచయితలు దృష్టి పెట్టి సంచలనాత్మక అంశాలను. పాటలను రాసి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా నియమకం చేసిన సతీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో సామాజిక అంశాలపై రచయితలను చైతన్యవంతం చేస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.