యాదాద్రిలో దివ్యాంగులకు షాపులు కేటాయించాలని వినతి

యాదాద్రిలో దివ్యాంగులకు షాపులు కేటాయించాలని వినతి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు, బీబీనగర్ మండలం కొండమడుగుకు చెందిన కనకబోయిన నాగరాజు ఆధ్వర్యంలో సమితి ప్రతినిధులు మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి దివ్యాంగులకు కొండపై కల్పించాల్సివున్న కొన్ని అదనపు సదుపాయాలను గురించి చర్చించారు. గుడి ప్రాంగణంలోవున్న దుకాణాలను కొన్నింటిని స్థానిక దివ్యాంగ నిరుద్యోగులకు కేటాయించాలని కోరారు.

అలాగే వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రి దైవ దర్శనానికి వచ్చిన దివ్యాంగ భక్తులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు, తగినన్ని వీల్ చైర్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజుతో పాటు కన్వీనర్ బండ జహింగీర్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్, కార్యదర్శి ఇప్పటి రమేష్, తుమ్మల రవి, మహిళా అధ్యక్షురాలు మీసాల శోభ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ, తుమ్మల రవి, పల్లపు ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.