ఘనంగా గణనాథుని నిమజ్జనం

ఘనంగా గణనాథుని నిమజ్జనం

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి మండలంలోని హనుమాపురం మదిరే కురుమ గూడెం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా విగ్రహ దాత సాధినేని ఉపేందర్ సహకారంతో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాధుడి శోభాయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు.  అనంతరం గ్రామ సమీపంలోని మదీనా చెరువులో యూత్ సభ్యులు, గ్రామస్తులు, చిన్నారులు, భక్తులు, కలిసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ 8వ వార్డు మెంబర్ తోటకూరి వెంకటేష్ కమిటీ సభ్యులు కుసుమ వెంకటేష్, అశోక్, జాన కిషన్, బొబ్బల భరత్ రెడ్డి, పాండరీ, శ్రీకాంత్ పాల్గొన్నారు.