రహదారి సమస్యకు ఒక్కరోజులో పరిష్కారం

రహదారి సమస్యకు  ఒక్కరోజులో పరిష్కారం

ఎమ్మెల్యేకు, మున్సిపల్ కమిషనర్ కు సన్మానం

ముద్ర, రాజేంద్రనగర్: బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ బైరాగిగూడ - నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామాల మధ్య రోడ్డు వివాదాన్ని 24 గంటల్లో పరిష్కరించిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంధం గూడ, బైరాగిగూడ కాలనీల ప్రతినిధులు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శివపురి కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా కాలనీలో ప్రతినిధులు మాట్లాడుతూ నార్సింగి మీదుగా ఐటీ కారిడార్ వైపు వెళ్లే వారికి ఈ రోడ్డే ప్రధానమని వివరించారు.

కొంతమంది వ్యక్తిగత స్వార్థంతో ఈ సమస్యను సృష్టించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఇది ప్రభుత్వం ప్యాకేజీ వి కింద హెచ్ ఆర్ డి సి ఎల్ ప్రతిపాదించిన 9 లింక్ రోడ్లలో ఒకటని వారి పేర్కొన్నారు. సమస్య సత్వర పరిష్కారాన్ని కృషి చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి లను కాలనీల ప్రతినిధులు కలిసి ఘనంగా సన్మానించారు. ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు నాగార్జున రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రమేష్ మంద తదితరులు పాల్గొన్నారు.