ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీకి కవిత

ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీకి కవిత

ముద్ర,సెంట్రల్ డెస్క్:  ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో సీబీఐ(CBI) అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. అంతకుముందు కవితను అరెస్టు చేసిన సీబీఐ ఆమెను శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని పరిశీలించిన కోర్టు ఆమెను ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశించింది.

      ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను నేడు కోర్టులో హాజరు చింది సీబీఐ. నిన్న కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఈ ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టిన సీబీఐ కవితను అయిదు రోజుల పాటు త‌మ కస్టడీకీ ఇవ్వాల‌ని కోరింది.

ముందుగా సిబిఐ న్యాయ‌వాది త‌న వాద‌న వినిపిస్తూ.… కవిత ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలక పాత్రధారి అని విజయ్ నాయర్, తదితరులతో కలిసి స్కెచ్ వేశారని ఆరోపించారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందనీ పేర్కొన్నారు. రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారనీ ఆరోపించారు. కవిత సూచన మేరకు మాగుంట రాఘవరెడ్డి  25 కోట్లు అందజేసారనీ ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారనీ, వాట్సాప్ చాట్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయనీ కోర్టుకు వాటిని అందజేశామని వివరించారు.కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు.

ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో 33% వాటా ఉందనీ, ఇవన్నీ తాము ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలో పొందుపరిచామని. ఆధారాలు కూడా జతపరిచామని తెలిపారు. శరత్ చంద్ర రెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్ కి రూ 5 కోట్లు చొప్పున రూ. 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారనీ, అందుకు శరత్ చంద్ర రెడ్డి విముఖత వ్యక్తం చేశారనీ, దీంతో శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారనీ, హైదరాబాద్ తన వ్యాపారం సాగనివ్వను అని బెదరించారనీ పేర్కొన్నారు.

దీని త‌ర్వాత కవిత తరఫున న్యాయ‌వాది వాదనలు ప్రారంభించారు.. ప్ర‌స్తుతం వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. కాగా,. సౌత్ గ్రూపునకు ఆప్‌కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 6న తీహార్‌ జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది.

ఇటు సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. జడ్జ్ ఆదేశాలతో ఈ ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయనున్నారు ఆమె లాయర్లు. 

ఇప్పుడు ఆమెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేశారు. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ కేసుతో ఆమె జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికొస్తారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. గతంలో చాలా కేసుల్లో నెలల తరబడి నిందితులు జైలులోనే ఉన్నారు.ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నో నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు.