ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కు సత్కారం

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కు సత్కారం


ముద్ర ప్రతినిధి, బీబీనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరీగారి ప్రీతమ్ ను గురువారం యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దర్గాయి హరిప్రసాదర్, ప్రధాన కార్యదర్శి బింగి శ్రీనివాస్ కలిసి పుష్పగుఛ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. గాంధీభవన్ లో గురువారం ఉదయం ఆయనను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముష్కే జైపాల్ రెడ్డి, జేరిపోతుల బాలయ్య  తదితరులు పాల్గొన్నారు.