ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : డి ఆర్ డి ఓ 

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : డి ఆర్ డి ఓ 

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని డి ఆర్ డి ఓ కృష్ణన్ అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనిచేస్తున్న కార్మికులకు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్వేప్ -2024 ఓటరు అవగాహన చైతన్యం కలిగించారు. ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపివో, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి ,ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.