రైల్వే అండర్ పాస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రైల్వే అండర్ పాస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి భువనగిరి : రైల్వే అండర్ పాస్ రోడ్డు పనులను శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ పాస్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం 6వ వార్డు హనుమాన్ వాడ లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  28 వార్డ్ ఆజాద్ రోడ్ లో జరుగుతున్న అండర్ డ్రైనేజి పనులను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏ వి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, యూత్ నాయకులు నాగారం సూరజ్ లున్నారు.