వెంకిర్యాల లక్ష్మీనారాయణస్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక

వెంకిర్యాల లక్ష్మీనారాయణస్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక


ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నూతన ఉత్సవ కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ గా కసిరెడ్డి ఇంద్ర, ధర్మకర్తలుగా ఇటికాల శంకరయ్య ముదిరాజ్, చెరుకు బాలరాజ్ గౌడ్, కోనోజు లక్ష్మీనారాయణ చారి,  పొన్న పాండు, చింతల సురేందర్, బూరుగుపల్లి నరసింహలను ఎన్నుకున్నారు. దేవాలయ ఉత్సవ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చేరుకు అచ్చయ్య గౌడ్,  వెంకిర్యాల ఎంపిటిసి గండు వసంత బసవయ్య, సింగిల్ విండో డైరెక్టర్ చింతల శ్రీనివాస్ రెడ్డి, వెంకిర్యాల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరె నరసింహ ముదిరాజ్,  లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రాచమల్ల శ్రీనివాస్, వెంకిర్యాల మాజీ సర్పంచ్ అరిగే సుదర్శన్, సోము రమేష్, జంగా బుచ్చయ్య తదితరులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరయ్యారు