బీబీనగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

బీబీనగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
  • జడ్పీటీసీ గోలి ప్రణీత సహా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిక


ముద్ర ప్రతినిధి, బీబీనగర్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి బీబీనగర్ మండలంలో పెద్ద షాక్ తగిలింది. గత కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని, పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేసిన బీబీనగర్ జిల్లా ప్రాదేశిక సభ్యురాలు గోళి ప్రణీత రెడ్డి, ఆమె భర్త గోళి పింగల్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరితో పాటు బీఆర్ఎస్ పటిష్టానికి ఎనలేని కృషి చేసిన పలువురు నాయకులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో వారు తమ అనుచరులతో సహా గురువారం కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ లో వీరి చేరికతో బీబీనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలనుంది.

జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డిలతో పాటు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నారగోని మహేష్, ఎంపీటీసీ సభ్యులు గోలి నరేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యలు ఎండీ అక్బర్, మాజీ సర్పంచి మల్లగారి భాగ్యలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మన్నే బాలరాజు, పింగళి అన్న సేవాదళ్ అధ్యక్షుడు ఎండీ మోహిన్, నాయకులు శర్మ, మంగా అశోక్, కాసుల సత్యనారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సురకంటఇ సత్తిరెడ్డి, పంజాల పెంటయ్య గౌడ్ తదితరులతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ గెడ్డం బాలకృష్ణ గౌడ్ తదితరులు కూడా పాల్గొన్నారు