అయ్యా.. మాగోడు పట్టించుకోండి

అయ్యా.. మాగోడు పట్టించుకోండి
  • నరకం చూపిస్తున్న రోడ్డు
  • ఇబ్బంది పడుతున్న ప్రజలు
  •  పట్టించుకోని అధికారులు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:-రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దేశ్ముఖి గ్రామస్తులు ఆరోపించారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి, పిల్లయిపల్లి గ్రామాల మధ్యగల రోడ్డు నరకాన్ని చూపిస్తుంది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశ్ముఖి నుండి పిల్లాయిపల్లి  వెళ్లే ప్రధాన దారిలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డంతా పూర్తిగా ధ్వంసం అయింది. ప్రధానంగా గ్రామాల మధ్య క్రషర్లు ఉండడంతో టిప్పర్ల వంటి భారీ వాహనాల కారణంగా రోడంత ప్రమాదకరంగా మారింది. దేశ్ముఖి నుండి పోచంపల్లి మండల కేంద్రానికి వెళ్లాలంటే ముఖ్యంగా రాత్రిపూట గుంతలు కనపడక వాహనదారులు గుంతలో పడి గాయాల పాలవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వాహనదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు.

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి

అధికారుల స్పందించి ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కొడుతున్నారు. రెండు రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణించడంతో ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి  ధ్వంసమైన రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.