నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ ఎస్సై హరికృష్ణ  కోరారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ ద్వారా అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ శాఖ  అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ నాగార్జున రెడ్డి, మున్సిపల్ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాకులు 
 పాల్గొన్నారు.