హరితహారం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
![హరితహారం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64ec128a9260b.jpg)
- అదనపు కలెక్టర్ ప్రియాంక
నేరేడుచర్ల ముద్ర:- హరితహారం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ చక్కా ప్రియాంక అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం వెంచర్ లొ దశాబ్ది వనం లో మొక్కలు నాటి నా సందర్భంగా మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు, మొక్కల పెంపకంలో ప్రభుత్వలక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో చైర్మన్ చందమళ్ళ జయబాబు కౌన్సిలర్లు కొదమగుండ్ల సరిత , షేక్ బాష , కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి, డి ఇ స్వాతి బి ఆర్ఎస్ నాయకులు వేమూరి నారాయణ మున్సిపల్ కార్యాలయ అధికారులు సిబ్బంది ఆర్ పిలు తదితరులు పాల్గొన్నారు.