కోలాట మహిళలకు చీరలు పంపిణీ

కోలాట మహిళలకు చీరలు పంపిణీ

ముద్ర, చివ్వెంల: కోలాట బృందాల అభివృద్ధి కొరకే ప్రత్యేక చీరలు అందిస్తున్నామని గుంట కండ్ల సునీత అన్నారు. మండల పరిధిలోని చివేముల ,పాండ్యా నాయక్ తండ, అక్కల్దేవిగూడెం ,పచ్చ నాయక్ తండ, పిల్లల జగ్గు తండా ,సేవాలాల్ తండా, గుంజలూరు ,తుల్జారావుపేట ,తిమ్మాపురం గ్రామాలలో ఉన్న కోలాట బృందానికి ఆమె ప్రత్యేక చీరలను పంపిణీ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల లో కోలట బృందాలకు ఒకే రకమైన చీరలు ఉండాలనే లక్ష్యంతో మహిళలందరికీ చీరలు ఇవ్వడం జరిగిందని అన్నారు. జగదీష్ అన్న కప్ 2023 లో భాగంగా అన్ని గ్రామాలలో ఏర్పాటుచేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించామని అన్నారు. జిల్లా కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి , వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి,సర్పంచ్ లు  సుధాకర్ రెడ్డి,బిక్షం,భద్రు,గురువెందర్,రవి, కవితా అనిల్,మాజీ ఎంపీపీ నరసింహ రావు ,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉట్కూరి సైదులు,వార్డు మెంబర్లు ,మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.