గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

తుంగతుర్తి ముద్ర (టౌన్): నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సంగెం గ్రామ సర్పంచ్ యేష మల్ల సుశీల సామెల్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి సహకారంతో ప్రాథమిక పాఠశాలకు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏషా మల్లసృజన్, పిఎసిఎస్ డైరెక్టర్ కాకులారపు బిక్షం రెడ్డి ,వార్డు మెంబర్ ఉప్పల వెంకటరెడ్డి ,ఎస్ఎంసి చైర్మన్ మారగాని రాజీవ్, జటంగి సైదులు ,ఏస మల్ల శీను, నాగరాజు, ఏ ష మల్ల ప్రశాంత్,  తదితరులు పాల్గొన్నారు