మంచిర్యాల జిల్లాలో నలుగురు మావోయిస్టులను తదుపులోకి తీసుకున్న ఎస్ఐబీ నిఘావర్గాలు..?

మంచిర్యాల జిల్లాలో నలుగురు మావోయిస్టులను తదుపులోకి తీసుకున్న ఎస్ఐబీ నిఘావర్గాలు..?

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:- మంచిర్యాల జిల్లాలో నలుగురు మావోయిస్టులను ఎస్ఐబి నిగా వర్గాలు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ సమీపంలోని ఒకరి ఇంట్లో  నలుగురు మావోయిస్టులను ఉన్నారని ఎస్ఐబి నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత ఆరునెలల నుంచి నలుగురు మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిగా వర్గాలు దృష్టి సారించారు. దీంతో శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంట్లో మావోయిస్టులు ఉన్నారని అందిన సమాచారంతో  నిఘా వర్గాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అ నలుగురు మావోయిస్టుల వద్ద ఆయుధాలు ఉన్నావా...లేవా అనే విషయం ఇంకా నిఘా వర్గాలకు స్పష్టం చేయలేదు. స్థానిక పోలీస్ బలగాలు కూడా ఆ ఇంటికి చేరుకుంటున్నాయి. నలుగురు మావోయిస్టులు లొంగిపోని నేపథ్యంలో ఎదురుకాల్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పిఎల్ జి ఏ వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోడానికే వచ్చినట్టు తెలుస్తోంది. స్థావరం పొందిన నలుగురు మావోయిస్టుల హోదా కూడా తెలియాల్సి ఉంది.