కాంగ్రేస్ పార్టీలో చేరిన శాయంపేట సర్పంచ్ 

కాంగ్రేస్ పార్టీలో చేరిన శాయంపేట సర్పంచ్ 

శాయంపేట, ముద్ర :శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల పెద్దకోడపాక సర్పంచ్ అబ్బు ప్రకాశ్ రెడ్డి, శాయంపేట ఎంపీటీసీ బాసాని చంద్రప్రకాష్ బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, అదే బాటలో  శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి, కో ఆప్షన్ సభ్యులు ఎండి సాదిక్, మాజీ వార్డు సభ్యులు సామల రవీందర్, నాయకులు వల్పదాసి సదాశివుడు గురువారం టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, కర్ణాటక రాష్ట్ర కోలార్  నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి మాట్లాడుతూ ఈనెల 30న జరిగిన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు అందరిని కలుపుకొని పనిచేస్తానని జి ఎస్ ఆర్ కు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్, నాయకులు లక్ష్మీనారాయణ, సదాశివుడు  పాల్గొన్నారు.