కాటారం-మేడారం మధ్య రాకపోకలు బంద్

కాటారం-మేడారం మధ్య రాకపోకలు బంద్

ముద్ర న్యూస్,కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాటారం నుంచి తాడువాయి మండలంలోని మేడారం కు వెళ్లే రహదారి మధ్యలో గల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.దీంతో వాహన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి బుధవారం నుంచి కాటారం-మేడారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాళ్ల వద్ద నీటి ప్రవాహం ప్రవాహం ఉధృతంగా ఉండి నిమిష నిమిషానికి నీటిమట్టం పెరుగుతూ వస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహాముత్తారం ఎస్సై సుధాకర్ ముందస్తు చర్యలు చేపట్టారు. రహదారికి అడ్డంగా ట్యాంకర్ ఏర్పాటు చేసి వాహన రాకపోకలను నిలిపివేయించారు. దాంతోపాటు ప్రజలు ప్రయాణికులు ప్రత్యమ్మ మార్గాలను వెతుక్కోవాలని ఎస్సై దాసరి సుధాకర్ సూచించారు.