‘సర్వశిక్షా అభియాన్’ ముట్టడి ఉద్రిక్తం
- సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ఉద్యోగుల ఆందోళన
- లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడి
- అడ్డుకున్న పోలీసులు.. ఆర్.కృష్ణయ్య అరెస్ట్
ముద్ర, తెలంగాణ బ్యూరో : నగరంలోని లక్డీకాపూల్వద్ద బుధవారం నిర్వహించిన సర్వశిక్షా అభియాన్కాంట్రాక్ట్ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, మినిమం టైమ్ స్కేల్అమలు చేస్తూ హెల్త్ఇన్సూరెన్స్ఇవ్వాలని డిమాండ్చేస్తూ లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు. వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం వద్దకు చేరుకున్న ఉద్యోగులను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. వారికి మద్దతుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ను అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో లక్డీకాపూల్పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్అయ్యింది.