ధృవపత్రాలు లేని వాహనాల పట్టివేత

ధృవపత్రాలు లేని వాహనాల పట్టివేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో సాథ్ గావ్ లో సరైన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  భైంసా ఏ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ నేతృత్వంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం లో భాగంగా ఆదివారం ఈ తనిఖీలు నిర్వహించారు.

అలాగే 6 ఆటోలను కూడా స్వాధీన పరచుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలు, అపరిచితులు అమ్మే వాహనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు.