శిరోముండనం కేసులో వైజాగ్ కోర్టు సంచలన తీర్పు..వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో వైజాగ్ కోర్టు సంచలన తీర్పు..వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఈరోజు విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు దళితులను హింసించి వారిలో ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటనపై 28 ఏళ్ల విచారణ తర్వాత నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమాన విధించింది. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ కేసులో న్యాయం జరగడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.