నేతాజీ నగర్ లో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

నేతాజీ నగర్ లో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు రిక్రియేషన్ ఫోరం ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్  షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 50 ఏళ్లకు పైబడిన ఏజ్ గ్రూప్ డబుల్స్ లో వై రవీందర్ రెడ్డి, ఎంఎ మాలిక్ జట్టు విజయం సాధించి కప్ ను కైవసం చేసుకుంది. చలపతి, రాజు టీమ్ రన్నర్ అప్ గా నిలిచింది. 50 ఏళ్ల దిగువ గ్రూపులో పి రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బృందం విజయం సాధించింది.

రాజగోపాల్ రెడ్డి, కార్తీక్ టీమ్ రన్నర్ అప్ గా నిలిచింది. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి అప్పారావు, మాజీ అధ్యక్షుడు ఏ సత్యంబాబు, మాజీ కార్యదర్శి, ముద్ర దినపత్రిక సంపాదకుడు వై నరేందర్ రెడ్డి కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర దారుఢ్యం, మానసికల్లాసానికి దోహదం చేసే క్రీడలను ప్రోత్సహిస్తున్న ఫోరం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ రెసిడెంట్స్ రిక్రియేషన్ ఫోరం అధ్యక్షుడు కే వి బి మురళీమోహన్ రావు, నాయకులు శ్రీనివాసరావు, ఎంవీ రంగారెడ్డి, బాల శంకర్ రెడ్డి, ఉమేష్ కుమార్, చలపతి తదితరులు పాల్గొన్నారు.