టీఎస్​పీఎస్సీ పరీక్షల కొత్త తేదీలు

టీఎస్​పీఎస్సీ పరీక్షల కొత్త తేదీలు

ముద్ర తెలంగాణ బ్యూరో: టీఎస్​పీఎస్సీ వివిధ పోస్టుల ఎంపికకు నిర్వహిస్తున్న పరీక్షలను రీషెడ్యూల్​ చేసింది. ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షల తేదీలను మార్చుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్​ మోటారు వెహికల్​ ఇన్​స్పెక్టర్​, అగ్రికల్చర్​ ఆఫీసర్​, గౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​లోని వివిధ గెజిటెడ్​, నాన్​ గెజిటెడ్​ పోస్టులు, డ్రగ్స్​ ఇన్​స్పెక్టర్​ పోస్టుల రిక్రూట్​మెంట్​కు సంబంధించిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. ముందుగా షెడ్యూల్​ ప్రకటించిన పరీక్షల తేదీలను మార్చుతూ, కొత్త తేదీల వివరాలను ప్రకటించింది. రీ షెడ్యూల్​ ప్రకారం ఎఎంవీఐ పీరక్ష జూన్​ 28న ఉదయం, మధ్యాహ్నం,. అగ్రికల్చర్​ ఆఫీసర్​ పరీక్షను మే 16, గ్రౌండ్​వాటర్​ డిపార్ట్​మెంట్​ గెజిటెడ్​ పోస్టులకు పరీక్షలు 18, 19న, నాన్​గెజిటెడ్​ పోస్టులకు జూలై 20,21న, డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ పోస్టులకు మే 19న పరీక్ష నిర్వహించనున్నారు.