ఉత్తమ సేవలకు గాను నిమ్స్ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ సేవలకు గాను నిమ్స్ ఉద్యోగులకు అవార్డులు

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ లో పనిచేస్తున్న కే వి బి మురళీమోహన్ రావు తన సర్వీస్ లో అందించిన ఉత్తమ సేవలకు గాను అవార్డు పొందారు. డీ పీ ఎ-గ్రేడ్ బీగా పనిచేస్తున్న మురళీమోహన్ రావుకు టెక్నికల్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు నిమ్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎన్ బీరప్ప చేతుల మీదుగా మురళీమోహన్ రావు, మరి కొందరు ఉద్యోగులు ఈ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ బిపిన్ శాంతి వీర్, దీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.