వరల్డ్​కప్​కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

వరల్డ్​కప్​కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ముంబై: భారత్​ వేదికగా అక్టోబర్​ 5 నుంచి మొదలుకానున్న వన్డే వరల్డ్​కప్​కోసం సౌతాఫ్రికా మంగళవారం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో సౌతాఫ్రికా భారీ మార్పులు ఏమీ చేయనట్లు కనిపిస్తుంది. పేసర్​ గెరాల్డ్​ కొయెట్జీ మంచి ప్రదర్శనతో జట్టులో స్థానం దక్కించుకున్నాడు. టెంబా బవుమా సఫారీలకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. హెన్రిచ్​క్లాసెన్, డేవిడ్​మిల్లర్స్, రస్సీ వాన్​డర్​డస్సెన్, క్వింటన్​డికాక్, ఎయిడెన్​ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్​లకు జట్టులో స్థానం కల్పించారు. అలాగే పేస్​బౌలర్​ కగిసో రబాడ, అన్రిచ్​ నోర్జే, ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్​ కొయెట్జీ జట్టులో ఉన్నారు. వీరితోపాటు ఆల్​రౌండర్​మార్కో జన్సెన్, వరల్డ్​ క్లాస్​ స్పిన్నర్లు తబ్రేజ్​షంషి, కేశవ్లు స్థానం దక్కించుకున్నాడు. అక్టోబర్​ 7న ఢిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్​తో సౌతాఫ్రికా వరల్డ్​కప్​జర్నీని ప్రారంభించనుంది. అంతకుముందు 27న అఫ్ఘాన్​తో, అక్టోబర్​ 2న న్యూజిలాండ్​తో వార్మప్​ మ్యాచ్​లు ఆడనున్నారు.