డంపింగ్ యార్డు పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ వరుణ్ రెడ్డి

డంపింగ్ యార్డు పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పట్టణంలో చేపట్టిన డంపింగ్ యార్డు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత అర్బన్ తహసిల్దార్ ఆఫీసు, గాంధీ పార్కు బంగల్ పేట చెరువు సమీపంలోని డంపింగ్ యార్డ్ లను కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం సందర్శించారు. పాత అర్బన్ తాసిల్దార్ కార్యాలయ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నందునఆ ప్రాంతాన్ని చదును చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గాంధీ పార్క్ సందర్శించారు. డిఎంఎఫ్టి కింద మున్సిపాలిటీకి రూ.25 లక్షలు నిధులు మంజూరయ్యాయని , పార్కులో వాకింగ్ ట్రాక్ పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. బంగల్ పేట్ చెరువును సందర్శించి పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేసి బోటింగ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బంగల్ పేటలోని డంపింగ్ యార్డును సందర్శించి సీసీఈ ద్వారా ఏర్పాటు చేయబడిన ప్లాస్టిక్ మిషన్లకు వారం రోజుల్లోగా విద్యుదీకరణ చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.