విద్యార్థినిపై వీధి కుక్కల దాడి

విద్యార్థినిపై వీధి కుక్కల దాడి

గ్రేటర్ వరంగల్ లోని కాశీబుగ్గ రుద్రమాంబ కాలనీలో ఓ విద్యార్థిని వీధి కుక్కల దాడికి గురైంది.  మంగళవారం పాఠశాలకు వెళ్లే క్రమంలో విద్యర్థినిపై శూనకాలు ఎగబడ్డాయి. బాలిక భయంతో పరుగులు తీయటంతో ప్రమాదం పెను తప్పింది. వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు ప్రథమ చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.
ఎండలు తీవ్రం కావడంతో అధిక ఉష్ణోగ్రత తట్టుకొలేక వీధి  కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నాయి.కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువైందంటున్నారు స్థానిక ప్రజలు. కాలనీలలో కుక్కలు ఎక్కువ కావడంతో పిల్లల్ని ఒంటరిగా బడికి పంపాలంటే భయం వేసిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో వీధి కుక్కలు వెంట పడుతున్నాయని వాపోతున్నారు