విద్యుత్ భద్రత పొదుపుపై అవగాహన సదస్సు-వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సర్పంచ్ మోటే ధర్మన్న

విద్యుత్ భద్రత పొదుపుపై అవగాహన సదస్సు-వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సర్పంచ్ మోటే ధర్మన్న

మొగుళ్లపల్లి, ముద్ర న్యూస్ : విద్యుత్ భద్రత,  పొదుపుపై ఎన్పీడీసీఎల్ జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ట్రాన్స్ కో ఏఈ అడ్డగట్ల ప్రమోద్ అధ్యక్షతన అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న మాట్లాడుతూ.. రైతులు, విద్యుత్ వినియోగదారులు ప్రమాదాల బారిన పడకుండా విద్యుత్ అధికారుల సూచనలను పాటించాలని, అదేవిధంగా విద్యుత్తును పొదుపుగా వా డుకోవాలని సూచించారు. అనంతరం ఆయన రైతులతో, విద్యుత్ వినియోగదారులతో  కలిసి విద్యుత్ వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గణేష్ పల్లి సర్పంచ్ తిప్పారపు యుగేందర్, ఫోర్ మెన్  యాదగిరి, లైన్మెన్ రఘు, విద్యుత్ కార్మికులు వేముల కిరణ్, గడ్డం యుగంధర్, మహేందర్ రెడ్డి, రైతులు,బద్దం మోహన్ రెడ్డి, గుండారపు తిరుపతి, దేవునూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.