స్టూడెంట్స్ తో కేటీఆర్ లంచ్ ..భోజనానికి గంట ఆలస్యం

స్టూడెంట్స్ తో కేటీఆర్ లంచ్ ..భోజనానికి  గంట ఆలస్యం

కమలాపూర్ పర్యటనలో భాగంగా ఎంజేపీ పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి లంచ్ చేసారు. విద్యార్థుల మధ్య కూర్చొని వారితో సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేసారు. మంత్రి భోజనం చేసేందుకు సిద్దమవుతున్న క్రమంలో కొంతమంది విద్యార్థుల ప్లేట్లు ఖాళీగా కనిపించటంతో విద్యార్థులకు భోజనం వడ్డించాలని సదరు వ్యక్తులకు సూచించారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేసారు  ఇది ఇలా ఉండగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సి ఉండగా గంట ఆలస్యమైంది. సాధారణంగా విద్యార్థులు ఒంటిగంటకు భోజన విరామం ఉంటుంది. అయితే కేటీఆర్ పర్యటనలో భాగంగా విద్యార్థుల భోజన సమయంలో గంట ఆలస్యమవడంతో కొంత మంది విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక ఇబ్బందులు పడడటం గమనార్హం.