బిజెపి చీఫ్ కిషన్ రెడ్డికి  ఘన స్వాగతం

బిజెపి చీఫ్ కిషన్ రెడ్డికి  ఘన స్వాగతం


ముద్ర ప్రతినిధి, వరంగల్:బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా భూపాలపల్లికి వెళ్తున్న సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెపాడు వద్ద ఓ హోటల్ వద్ద భారీ ఎత్తున స్వాగతం పలికారు. షెడ్యూల్లో భాగంగా భూపాలపల్లికి వెళ్తున్న కిషన్ రెడ్డి 3:15 నిమిషాలకు హనుమకొండ ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర నాయకులు గరికపాటి మోహన్రావు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోతు హుస్సేన్ నాయక్, మాజీ మంత్రి గుండేకారి విజయ రామారావు,  నియోజకవర్గ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డాక్టర్ పెసర విజయ్ చందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.