అనారోగ్యంతో కేయూ అధ్యపకురాలు డాక్టర్ శోభారాణి మృతి

అనారోగ్యంతో కేయూ అధ్యపకురాలు డాక్టర్ శోభారాణి మృతి

ముద్ర, కేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కన్నుమూసారు. వీరి స్వగ్రామం వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేట గ్రామం, కాకతీయ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పి.హెచ్.డి. పూర్తి చేసి అధ్యాపకురాలిగా కొనసాగుతూనే మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆదివాసి, ప్రజల హక్కుల రక్షణ కోసం తుదికంఠ పోరాడారు.

అనేక రచనలు, కవిత్వాలు రాసి తెలుగు సాహిత్యాభివృద్ధి వికాసానికి కృషి చేశారు. డాక్టర్ శోభారాణి మృతి పట్ల కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, అరసంతో పాటు పలు సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఆమె మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని ఆమె కోరుకున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు.