స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
student committed suicide

ముద్ర ప్రతినిధి కరీంనగర్: గంగాధర లోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హాసిని బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. హాస్టల్లో ఉండి చదవడం ఇష్టం లేకనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిసింది.

రెండు రోజులు గడిచిన తల్లిదండ్రులు రాకపోవడంతో అందరి చూస్తుండగానే పాఠశాల మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. మొదట కాలు విరిగినట్లు గుర్తించిన స్థానికులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పాఠశాల విద్యార్థి మానసిక స్థితి తల్లిదండ్రులకు వివరించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.