గ్రామ గ్రామన హరితోత్సవం

గ్రామ గ్రామన హరితోత్సవం
  • మొక్కలు నాటిన అధికారులు

ముద్ర న్యూస్, రేగొండ:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగ సోమవారం రేగొండ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో హరితహారం హరితోత్సవం నిర్వహించారు.మండలంలోని రూపిరెడ్డీ పల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈకార్యక్రమనికి మండల స్పెషల్ ఆఫీసర్ శామ్యూల్,ఎంపీడీఓ సురేందర్,హాజరై గ్రామంలోని ఆయా ప్రదేశాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని నాటిన మొక్కను పెంచాలని కోరారు.మానవ మనుగడకు మొక్కలు ఆదరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐ లి శ్రీధర్ గౌడ్,అంగన్వాడీటీచర్ రజిత,ఆశవర్కర్ లీలావతి,సంపత్,సదానందం,భిక్షపతి, నర్సయ్య,గ్రామస్తులు పాల్గొన్నారు..