సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు
ముద్ర ప్రతినిధి, మెదక్: ఇందిరాగాంధీ స్టేడియం మెదక్ మెదక్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. సుమారుగా 280 బాల, బాలికలు పాల్గొన్నారు. ఇందులో రన్, త్రో & జంప్స్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. 25 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు ఫిబ్రవరిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెదక్ జిల్లా తరఫున పాల్గొంటారని మెదక్ డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. మధుసూదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్, కోచ్ పృద్వి, సుమన్, పీఈటీలు చంటి, మమత, క్రీడాకారులు పాల్గొన్నారు.